పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్..

by Dishafeatures2 |
పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్..
X

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి చేసుకోనున్న వారికి టీటీడీ శుభవార్త చెప్పింది. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు టీడీపీ కసరత్తులు చేస్తోంది. ఆగస్టు 7ను అందుకు ముహూర్తంగా టీటీడీ ఫిక్స్ చేసుకుంది. కళ్యాణమస్తుకు అర్హులైన వారు కలెక్టరేట్, ఆర్డీఓ ఆఫీస్‌లలో అప్లై చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. అర్హులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వ కార్యాలయంలో ఇచ్చిన దరఖాస్తును మీ వివరాలతో నింపి ఇవ్వాలని తెలిపింది. ఇందుకు అప్లై చేసుకునే వారు జులై 31 నాటికి వధువు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండాలి. ఈ కార్యక్రమానికి జులై 21 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న అర్హుల్లో పెళ్లి చేసుకునే వారికి పెళ్లి బట్టలు, బంగారు పుస్తెలు ఉచితంగా అందిస్తారు.


Next Story

Most Viewed