- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
TRS Protest: రోడ్డు మీద పొయ్యి వెలిగించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
దిశ, మక్తల్: TRS Protest in Narayanpet To Reduce LPG prices| నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి జాతీయ రహదారిపై వంటావార్పు చేశారు. అంతకుముందు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మూడు రాళ్ల పొయ్యిని అమర్చి వెలిగించారు. మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్ మండల కేంద్రంలో సిలిండర్ ధరలను తగ్గించాలని జాతీయ రహదారిపై రాస్తారోకో ధర్నా చేశారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు బుద్ధి చెప్పాలన్నారు. అచ్చేదిన్ తెస్తాం అంటూ సచ్చేదిన్ తెచ్చి సామాన్య కుటుంబాన్ని కష్టాల్లో నెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మైపాల్ రెడ్డి, కావలి హరి, కోళ వెంకటేష్, రవీందర్ రెడ్డి, నేతాజి రెడ్డి, షాలం, గూరకోండ శ్రీనివాస్, ఆయా మండలాల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
- Tags
- TRS Protest