శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గోన్న టీఆర్‌ఎస్ నాయకులు

by Web Desk |
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాల్గోన్న టీఆర్‌ఎస్ నాయకులు
X

దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారం గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యమూర్తి ప్రతిష్ఠా మహోత్సవం బుధవారం అత్యంత వైభవోపేతంగా, శాస్త్రయుక్తంగా నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మాజీ తుమ్మల నాగేశ్వరరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్ట జరిగింది.

విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, దమ్మపేట జెడ్పీటీసి పైడి వెంకటేశ్వరరావు, ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి, దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు దొడ్డకుల రాజేశ్వరరావు, జారే ఆదినారాయణ, యేల్లిన రాఘవరావు, యర్రగొర్ల రాధాకృష్ణ, కాసాని నాగప్రసాద్, హరిబాబు, అబ్దుల్ జిన్నా, బొల్లికొండ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed