షోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బీజేపీ కార్యకర్త ఇంటిపై దాడి.!

by Disha Web Desk 12 |
షోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు బీజేపీ కార్యకర్త ఇంటిపై దాడి.!
X

దిశ, నాగర్‌కర్నూల్: కందనూల్ జిల్లా కేంద్రంలో టీఆరఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. గత కొన్ని రోజులుగా పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త విజయ్ భాస్కర్ స్థానిక సమస్యల పై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఒక పోస్టు పెట్టడం తో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కొందరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు తన ఇంటికి వచ్చి తాను తన కుటుంబంపై దాడి చేశారని ఆరోపించారు.

వందకు డయల్ చేసిన.. బాధితులకు చేదు అనుభవం ఎదురైంది. పోలీసులు వచ్చి విచారిస్తున్న క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు పెద్ద సంఖ్యలో ముకుమ్మడిగా కుటుంబం పై దాడికి దిగారు. అక్కడే ఉన్న జర్నలిస్టుల సెల్ ఫోన్లు లాక్కుని వీడియోలను డిలీట్ చేశారు. దీంతో కొద్ది సేపు బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇదంతా పోలీసుల ముందు జరగడం విశేషం.



Next Story

Most Viewed