జీపును ఢీ కొన్న ఆటో.. ట్రాన్స్‌జెండర్ మృతి

by Batti.Sumithra |   (  Updated:2026-07-01 14:04:53  IST  )

ఆమనగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందారు. జీపును వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జీపును ఢీ కొన్న ఆటో.. ట్రాన్స్‌జెండర్ మృతి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : ఆమనగల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాన్స్‌జెండర్ మృతి చెందారు. జీపును వెనుక నుంచి ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ట్రాన్స్‌జెండర్ అమ్ములును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న ఆమనగల్లు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story