తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

by Batti.Sumithra |

తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.

తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
X

దిశ, రఘునాథపల్లి: తాడిచెట్టు పై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కైలాసపురం గ్రామానికి చెందిన దూడల ఉపేందర్ (42) రోజువారీ వృత్తిలో భాగంగా కల్లు తీయడానికి తాడిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిపారు.

Next Story