- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Weather Update: మరో రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు.. అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ..!
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది.

దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిపోతుంది. మరీ నేడు వర్షాలపై వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ ఏంటో చూద్దాం.. బంగాళఖాతంలో అల్పపీడనం నేడు బలహీనపడనుంది. కాగా ఈ నెల(డిసెంబరు) 17, 18 తేదీల్లో రాయలసీమ(Rayalaseema), కోస్తోంధ్రా(kosthandhra)ల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ(Department of Meteorology) వెల్లడించింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేనప్పటికీ.. 16 వ తేదీ నాటికి మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురస్తూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అంచనా వేసింది. చలి మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
హైద్రాబాద్లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..27 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.






