'షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయిస్తారని ఆశించాం'

by Disha Web Desk 2 |
షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయిస్తారని ఆశించాం
X

దిశ, మల్లాపూర్: టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగత కారణాల రీత్య ముత్యంపేట చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరించకపోవడం దారుణమని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వరి, మొక్కజొన్న వేయొద్దని చెప్పిన తరుణంలో రైతులకు చెరుకు పంటనే ఉత్తమమన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తారని ఆశించారని కానీ, ఉన్న ఫ్యాక్టరీ మూతపడేలా చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కంతి మోహన్ రెడ్డి, గూడ రాజారెడ్డి, ముత్తన్న, చింతకుంట శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎల్కా కమలాకర్, జిల్లాపల్లి దిలీప్ కుమార్, అజారుద్దీన్, కంతి రమేశ్, సనిగరపు అశోక్, కాట దశరథం, వన్నెల శశి, మ్యాన సతీశ్, రెబ్బటి మల్లయ్య, యెసల గంగారెడ్డి, గజ్జ రాజేందర్, బండి రాజేందర్, లాడె రాజారెడ్డి, పిట్ల సాయిరాం, మోసే సంజీవ్, ఒర్రె మహేందర్, కసయి శేఖర్, పలువురు ప్రజాప్రతినిధులు, చెరుకు రైతులు, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed