- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల అప్డేట్.. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతుండటంతో టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడి ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాలో వేసవి సెలవులు చివరి దశకు చేరుకోవడం, వాతావరణం చల్లబడటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల కొండపై ఎక్కడ చూసిన జనసందోహం గా మారిపోయింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం తెల్లవారుజామునే భక్తుల రావడంతో రద్ధీ పెరిగింది. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తులతో సర్వదర్శనం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూలైన్లు దాటి వెలుపలికి భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, టోకెన్ లేని సామాన్య భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 20 గంటల సుదీర్ఘ సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు క్యూలైన్లలోనే పాలు, తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇదిలా ఉంటే శనివారం ఒక్కరోజే మొత్తం 90,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.స్వామివారికి తమ భక్తిని చాటుకుంటూ నిన్న 52,236 మంది భక్తులు కళ్యాణ కట్ట లో తలనీలాలు సమర్పించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నిన్నటి శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు వెల్లడించారు.






