- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tirumala Updates : తిరుమల అప్డేట్.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న 80,841 మందికి దర్శనం.. హుండీ ఆదాయం రూ. 3.45 కోట్లు.

దిశ, వెబ్ డెస్క్: కలియుగ దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో భక్తుల రద్దీ (Crowd of devotees) విపరీతంగా పెరిగింది. గత నాలుగు రోజులుగా స్వల్పంగా పెరిగినప్పటికీ.. నేడు వారాంతం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు వెలుపల ఉన్న శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 18 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే శనివారం ఒక్కరోజే మొత్తం 80,841 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న వారిలో 33,559 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.45 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు టీటీడీ (TTD) అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా అన్నప్రసాదం, పాలు తాగునీరు పంపిణీ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులకు సహకరించాలని కోరారు.






