రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి

by Dishanational2 |
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
X

దిశ,ఉత్తరాంద్ర : విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోటారు సైకిల్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందగా వారి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు విశాఖలోని శివలింగపురానికి చెందిన మృతులు.. శ్రావణ్(7) సుహాస్(8) గా గుర్తించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారులు ఇద్దరు మృతి చెందిన ఘటనను చూసిన స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.


Next Story

Most Viewed