‘మన శంకర వరప్రసాద్ గారు’లో నయనతార ఎంట్రీ వెనుక అసలు కథ ఇదే.. రివీల్ చేసిన అనిల్ రావిపూడి!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 03:08:21  IST  )

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)

‘మన శంకర వరప్రసాద్ గారు’లో నయనతార ఎంట్రీ వెనుక అసలు కథ ఇదే.. రివీల్ చేసిన అనిల్ రావిపూడి!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించాడు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా మంచి టాక్‌తో పాటు కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. ఇక ఈమూవీ విడుదలకు ముందు నయనతార ఒక ప్రత్యేకమైన రూల్‌ను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు ప్రమోషన్లకు దూరంగా ఉండే నయన్… ‘మన శంకర వరప్రసాద్ గారు’ కోసం మాత్రం పూర్తిస్థాయిలో ప్రమోషన్లలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చేసిన కష్టం ఫలించి.. సినిమాకు భారీ స్పందన లభించింది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి, వెంకటేష్, అనిల్ రావిపూడి కలిసి ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అందులో చిరంజీవి అనిల్ రావిపూడిని .. ‘నయనతారను ఈ సినిమాకు ఎలా ఒప్పించావు?’ అంటూ సరదాగా ప్రశ్నించారు. దానికి అనిల్ రావిపూడి స్పందిస్తూ.. ‘‘చిరంజీవి గారి స్థాయికి సమానంగా నిలబడగల, ఆయన స్టార్ డమ్‌కు ధీటుగా కనిపించే హీరోయిన్ ఎవరు అని ఆలోచించాను. అలాంటి పాత్రకు నయనతార తప్ప ఇంకెవ్వరూ సరిపోరనిపించింది. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకుంటే కథకే నష్టం జరుగుతుందని భావించాను. అందుకే నయనతార గారిని సంప్రదించాను’’ అని చెప్పాడు. కథ మొత్తం విన్న తర్వాత నయనతారకు కథ బాగా నచ్చిందని, అయితే కొన్ని టెక్నికల్ అంశాలపై సందేహాలు ఉన్నాయని తెలిపిందని అనిల్ వెల్లడించాడు.

‘‘నేను చిరంజీవి గారితో సినిమా చేయాలి, ఇందులో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. కానీ కొన్ని టెక్నికాలిటీస్ కుదరడం లేదని ఆమెకు చెప్పాను. అప్పుడు నయనతార గారు ‘నేను ఈ సినిమా చేయను అని చెప్పితే నువ్వేం చేస్తావ్?’ అని అడిగారు. దానికి నేను వెంటనే ‘మీరు వెంకటేష్ గారి ‘దృశ్యం’ సినిమా చూశారు కదా.. అందులో లాగానే ఈరోజు నేను నయనతార గారికి ఫోన్ చేయలేదు, కథ చెప్పలేదు అని భావించుకుని నిద్రపోతాను’ అని అన్నాను’’ అని నవ్వుతూ వివరించాడు. దానికి స్పందించిన నయనతార.. ‘‘మనమిద్దరం ఈ సినిమా చేస్తున్నాం. ఆ టెక్నికల్ విషయాలన్నీ క్లియర్ చేసుకో’’ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read More..

‘మన శంకర వర ప్రసాద్ గారు’ మెగా సక్సెస్ పార్టీ.. ఫొటోలు వైరల్

Next Story