- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డబుల్ ఇంజన్ ప్రభుత్వానికే పట్టం కట్టాలి: ప్రధాని మోదీ

ఇంఫాల్: ఈ ఎన్నికలు మణిపూర్లో రాబోయే 25 ఏళ్ల భవిష్యతును నిర్ణయిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం ఇంఫాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్థిరత్వం, శాంతి చేకూరాయని చెప్పారు. మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఈశాన్య రాష్ట్ర ప్రజలను ఆయన కోరారు. 'గత నెలతో మణిపూర్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సమయంలో రాష్ట్రాన్ని అనేక పార్టీల పాలించాయి.
కానీ కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో మణిపూర్లో అసమానతలే వచ్చాయి' అని అన్నారు. గత ఐదేళ్లలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం మణిపూర్ అభివృద్ధికి కట్టుబడి పని చేసిందన్నారు. ప్రజలు మంచి పరిపాలనను చూశారని తెలిపారు. ఈ ఎన్నికలతో 25 ఏళ్ల అభివృద్ది కి శంకుస్థాపన వేసినట్లేనని చెప్పారు. తొలిసారి ఓటు వేసేవారు కమలం గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. యువత ప్రభుత్వ ఎజెండాలో కీలకమని చెప్పారు.
గత ఐదేళ్లలో స్థిరంగా ఉన్న అభివృద్దిని కొనసాగించాలంటే తప్పనిసరిగా తమకే ఓటు వేయాలని కోరారు. మరోవైపు కాంగ్రెస్ మణిపూర్ సంస్కృతిని అపహాస్యం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మణిపూర్ వచ్చి వస్త్రాధారణ, సంస్కృతిపై ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ మణిపూర్ను పర్వతాలు, లోయల మధ్య విభజించి రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అంతకుముందు మోడీ బీజేపీ కార్యకర్తలతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పలువురితో ఫోటోలు దిగారు.