తాళం వేసిన ఇంట్లో చోరీ

by Jakkula.Mamatha |

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లక్ష్మీ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది.

తాళం వేసిన ఇంట్లో చోరీ
X

దిశ, తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణం లక్ష్మీ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. లక్ష్మీ నగర్‌లోని చంద్రమౌళి విద్యుత్ శాఖ ఉద్యోగి వారం రోజులుగా తిరుపతి తీర్థయాత్ర వెళ్లి శనివారం రాత్రి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని ఇంట్లో వెళ్లి చూడగా బీరువా డ్రాలు తొలగించి అందులో ఉన్న సుమారు ఐదు తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.1,50,000 నగదును దొంగిలించినట్లు చంద్రమౌళి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు.

Next Story