రక్తంలో సినిమా పోస్టర్‌ గీసిన మహిళా.. ఫొటోస్ వైరల్

by Disha Web |
రక్తంలో సినిమా పోస్టర్‌ గీసిన మహిళా.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 'ది కశ్మీర్ ఫైల్స్' విడుదలైనప్పటి నుంచి దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇదే క్రమంలో ఈ సినిమాకు రోజు రోజుకు పాజిటివ్ రెస్పాన్స్ పెరుగుతోంది. అయితే తాజాగా 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని చూసి తన రక్తంతో పోస్టర్‌ను రూపొందించింది ఓ మహిళ. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఆమెకు ట్విట్టర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఇలా రాశాడు.. "OMG. నమ్మశక్యంగా లేదు. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.. మంజు సోనీ జీకి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో." "ఎవరికైనా ఆమె గురించి తెలిసినట్లయితే, దయచేసి ఆమె వివరాలు DMలో నాతో పంచుకోండి" అని నెటిజన్లను కోరారు.



Next Story

Most Viewed