అప్పు ఇచ్చాడని అక్రమ సంబంధం.. అర్ధరాత్రి నలుగురు కలిసి..

by Disha Web Desk |
అప్పు ఇచ్చాడని అక్రమ సంబంధం.. అర్ధరాత్రి నలుగురు కలిసి..
X

దిశ, జడ్చర్ల : కలకాలం భర్తతో కలిసి ఉండాల్సిన భార్య వివాహేతర సంబంధంతో భర్త అడ్డు తొలగించుకోవాలని చివరికి పక్కా పథకం ప్రకారం తాళి కట్టిన భర్తనే కడతేర్చిన ఘటన పాలమూరు జిల్లాలో వెలుగు చూసింది.. జడ్చర్ల మండలం బూరుగుపల్లి గ్రామం హరిజనవాడకు చెందిన శ్రీశైలం తన భార్య గీత గత కొన్ని నెలల క్రితం హైదరాబాదులోని బతుకుదెరువు కోసం కూలిపనికి వెళ్లారు. దీంతో బతుకు భారంగా మారడంతో కుటుంబ పోషణ కోసం భార్య గీత అక్కడ తెలిసిన రాజు, విక్రమ్ ల వద్ద 50 వేల రూపాయలను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పు ఇచ్చిన సాకుతో విక్రమ్.. గీతతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నారు. దీంతో ఇటీవల కాలంలో శ్రీశైలం, గీతలు కలిసి తమ స్వగ్రామమైన బూరుగుపల్లికి వచ్చారు. జీవనోపాధి కోసం శ్రీశైలం రోజు కూలిగా పని చేస్తున్నాడు. కాగా తన భర్త శ్రీశైలంని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన భార్య గీత, ఆమె తల్లి, రాజు, విక్రమ్ కలసి ప్లాన్ వేశారు.

దీనిలో భాగంగా గత నెల 31 వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో డబ్బు విషయమై మాట్లాడదామని గ్రామ సమీపంలో వ్యవసాయ పొలాల్లోకి రప్పించారు. అక్కడ శ్రీశైలానికి పీకలదాకా మద్యం తాగించి కళ్లల్లో కారం కొట్టి.. రాడ్‌తో తలపై బలంగా కొట్టడంతో శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి భార్య ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో జరిగిన విషయాన్ని భార్య గీత పోలీసులకు తెలపడంతో గీతతో పాటు తన తల్లిని వారికి సహకరించిన రాజు, విక్రమ్ లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి నుండి 6 సెల్ఫోన్లు, చంపడానికి ఉపయోగించిన (రాడ్) ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ తరలించినట్లు మహబూబ్ నగర్ డీఎస్పీ కిషన్ తెలిపారు. హత్య కేసును ఛేదించిన జడ్చర్ల పోలీసులను కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రమేష్ బాబు రూరల్ సీఐ జమ్ములప్ప ఎస్సైలు రాజేందర్ నాయక్ మహమ్మద్ ఖాదర్ జయ ప్రసాద్ పోలీసు సిబ్బంది ఉన్నారు.



Next Story

Most Viewed