బాబాయ్‌తో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి

by Disha Web Desk 12 |
బాబాయ్‌తో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి
X

దిశ ప్రతినిధి, వైరా: తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఇనూపనూరి జయరాజ్ గత నెల 26 తారీఖున అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులు మృతిపై పలు అనుమానాలు వెల్లడించడంతో.. మృతుని భార్యపై అనుమానం వ్యక్తం చేయడం, మృతుడి తల పై బలమైన గాయం ఉండడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ స్నేహ మొహర, సీఐ వసంత్ కుమార్, ఎస్ఐ సురేష్, క్లూస్ టీం సభ్యులు ఇచ్చిన సమాచారంతో దర్యాప్తును వేగవంతం చేశారు. వారం రోజుల వ్యవధిలోనే జయరాజు మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

జయరాజ్ భార్య ఇనుపనూరి నిరోషా, కల్లూరు మండలం చిన్న కోరుకొండి గ్రామానికి చెందిన మాడుగులు కృష్ణ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే నిరోషాకు కృష్ణ సమీప బంధువు కావడం.. వరసకు బాబాయ్ కావడంతో అతనితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. వీరిద్దరి మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని కారణంగా ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి గత నెల 26వ తారీఖున మద్యం మత్తులో ఉన్న జయరాజు తలపై కొట్టి చంపేశారని మృతుని భార్య నిరోషా, ఆమె ప్రియుడు కృష్ణ నేరాన్ని అంగీకరించడంతో నిందితులను మధిర కోర్టుకు తరలించారు. మర్డర్ కేసు మిస్టరీని వారం రోజుల వ్యవధిలోనే ఛేదించిన సీఐ వసంత కుమార్, ఎస్ఐ పి. సురేష్, పోలీస్ సిబ్బందిని ఏ.సీ.పీ స్నేహ మొహర ప్రత్యేకంగా అభినందించారు.


Next Story