బైక్ అదుపు తప్పి కింద పడి వీఆర్వో మృతి

by Disha Web |
బైక్ అదుపు తప్పి కింద పడి వీఆర్వో మృతి
X

దిశ, పరిగి : విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ వీఆర్వో బైక్​ అదుపుతప్పి కింద పడి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం దోమ మండలం బుద్దాపూర్ గ్రామానికి చెందిన ఆశన్న(48) భార్య గోపమ్మ వీరికి ప్రమీల, వెంకటేష్, రవి అను ముగ్గురు సంతానం ఉన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా నవాబుపేట్​ మండలంలో ఆశన్న వీఆర్వో విధులు నిర్వహిస్తున్నాడు. విధులు ముగించుకొని ఆశన్న, దోమ మండలం కిష్టాపూర్​ గ్రామానికి చెందిన బోయిన శ్రీనివాస్​ ఇద్దరు కలిసి మోటారు సైకిల్​పై శుక్రవారం రాత్రి హైవే 163 పై రంగంపల్లి శివారులో వస్తున్నారు. ప్రమాదవశాత్తు బైక్​ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్​కు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన ఆశన్న, శ్రీనివాస్ లను పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. ఆశన్న పరిస్థితి విషయమంగా ఉండటంతో పరీక్షలు చేస్తుండగా మృతి చెందాడు. గాయాలైన బోయిన శ్రీనివాస్​ను మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్ చేశారు.

Next Story

Most Viewed