అట్టహాసంగా తిరుక్కళ్యాణ మహోత్సవం..

by Disha Web Desk 19 |
అట్టహాసంగా తిరుక్కళ్యాణ మహోత్సవం..
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం) 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 4వ రోజు సోమవారం ఉదయం త్రిదండి జీయర్ స్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 9 గంటల నుంచి ఉత్సవ సంకల్ప హవనం, వైభవంగా నిర్వహించారు. త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి శ్రీ వైకుంఠపురంను సందర్శించి ఆలయంలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో తిరుక్కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రవచనాలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి గరుడ సేవ, బలిహరణం కార్యక్రమాలు జరిపారు. భక్తులు చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు పొందారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed