దారుణం : తల్లిని చంపిన తనయుడు

by Dishanational2 |
దారుణం : తల్లిని చంపిన తనయుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నవమోసాలు కని పెంచిన కన్నతల్లినే కన్న కొడుకు హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని పల్నాడు బస్టాండ్ సమీపంలో తల్లి శివమ్మను, కొడుకు బత్తుల వెంకట్రావు అతిదారుణంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న నర్సరావుపేట టూటౌన్ పోలీసులు వెంకట్రావును అదుపులోకితీసుకుని విచారణ చేపట్టారు. వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story