అదుపు తప్పి కాలువలో ట్రాకర్ బోల్తా.. వ్యక్తి మృతి

by Dishanational2 |
అదుపు తప్పి కాలువలో ట్రాకర్ బోల్తా.. వ్యక్తి మృతి
X

దిశ ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ గ్రామ సమీపంలో సదర్మాట్ కాలువలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా కొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ షేక్ హిమమ్(42) మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్లితే.. ఖానాపూర్ పట్టణం‌లోని కరీం కాలని‌కి చెందిన షేక్ హిమమ్, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో కంకర్ తీసుకరవడానికి సదర్మాట్ కాలువ నుండి వెళ్లగా అదుపుతప్పి ట్రాక్టర్ కాలువలో బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షేక్ హిమమ్ ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Next Story