- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పరువు తీశాడంటూ నిర్మాతపై కేసు వేసిన స్టార్ హీరో.. భారీ జరిమాన విధించిన న్యాయస్థానం
దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో శింబు తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వలేదంటూ నిర్మాతలపై కేసు వేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసులో తాజాగా మద్రాస్ హైకోర్టు శింబుకు ఊరట కలిగిస్తూ.. తమిళ సినీ నిర్మాతల సంఘానికి లక్ష రూపాయల జరిమానా వేసింది. అసలు విషయానికొస్తే.. మైఖేల్ రాయప్పన్ నిర్మాతగా శింబు ప్రధాన పాత్రలో 2016లో విడుదలైన చిత్రం 'అన్భానవన్ అడంగాదవన్ అసరాదవన్'. ఈ సినిమాలో నటించినందుకు రూ.8 కోట్లు పారితోకం ఇస్తానన్న నిర్మాత అడ్వాన్స్గా రూ. కోటి 51 లక్షలు ఇచ్చి.. మిగిలిన రూ.6 కోట్ల 48 లక్షలు ఇవ్వట్లేదని, దాన్ని పూర్తిగా ఇప్పించాలంటూ నడిగర్ సంఘంలో శింబు ఫిర్యాదు చేశాడు.
అంతేకాదు నిర్మాత మైఖేల్ సామాజిక మాధ్యమాల్లో తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న హీరో చెన్నై హైకోర్టులో కోటి రూపాయల పరువు నష్టం దావా వేశారు. అయితే చాలాకాలంగా విచారణలో ఉన్న ఈ కేసును తాజాగా పరిశీలించిన న్యాయమూర్తి వేల్ మురుగన్.. నిర్మాతల సంఘం లిఖిత పూర్వకమైన వాదనలను కోర్టులో దాఖలు చేయని కారణంగా ప్రొడ్యూసర్స్ సంఘానికి రూ.లక్ష ఫైన్ వేస్తూ.. మార్చి 31లోగా మిగిలిన మొత్తాన్ని కోర్టు రిజిస్టర్ కార్యాలయంలో చెల్లించాలని ఆదేశించారు.