వివాదంగా ట్వీట్.. ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం

by Disha Web |
వివాదంగా ట్వీట్.. ఐఏఎస్ అధికారికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు గాను ఐఏఎస్ అధికారి నియాజ్ ఖాన్‌కు నోటీసులు జారీ చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం బుధవారం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ఎంపీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న నియాజ్ ఖాన్ గత వారం ఒక ట్వీట్‌లో.. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ముస్లింల హత్యలపై సినిమా తీయాలని కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతలను కోరారు. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన వారు పురుగులు కాదని, వారు కూడా దేశ పౌరులేనని రాసుకొచ్చాడు.

కాగా, ఈ విషమై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ.. "తాను ఖాన్ ట్వీట్‌లను చూశానని. నియాజ్ ప్రభుత్వ అధికారులను ఉల్లంఘిస్తున్నాడు" అని మిశ్రా అన్నారు.

Next Story