దారుణం.. బ్రతికుండగానే భార్యను పూడ్చిపెట్టిన భర్త

by Disha Web Desk 12 |
దారుణం.. బ్రతికుండగానే భార్యను పూడ్చిపెట్టిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: మనసారా ప్రేమించిన బార్యను భర్త బ్రతికుండగానే పుడ్చిపెట్టాడు. ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు వేలూరు జిల్లా కాట్పాడి లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినాయకం, సుప్రజలు నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా భార్య సుప్రజ అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రజను వినాయకం వేధిస్తూ ఉండే వాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం భార్య ను తీవ్రంగా కొట్టాడు. తీవ్ర గాయాలయినా సుప్రజ స్పృహ కోల్పోయింది.

దీంతో ఆమె బ్రతికుండగానే వినాయకం తమ్ముడు విజయ్, స్నేహితుడు శివ సాయంతో అడవిలో పూడ్చి పెట్టారు. సుప్రజ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు భర్త వినాయకం ను విచారించగా.. తామే తాను సుప్రజను కొట్టి.. అడవి ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అటవీ ప్రాంతంలో పూడ్చిన సుప్రజ మృతదేహాన్ని పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. దీనికి కారణమైన భర్త వినాయకం తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

స్వీట్ 16లో చేయాల్సిన పని.. 35 ఏళ్లకు చేస్తే? అన్నీ కనిపించవా మరి..!





Next Story

Most Viewed