ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

by Disha Web Desk 13 |
ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఖాళీలను భర్తీ చేసేందుకు.. ఎన్నికల కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల పరిషత్ అధ్యక్ష పదవికి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మల్కాజిగిరి మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేశారు.


ఈ నెల 22న ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు మేరకు అధికారులు.. మండల పరిషత్ సభ్యులతో సమావేశం నిర్వహించి నామినేషన్లను స్వీకరిస్తారు. 26వ తేదీన దాఖలైన నామినేషన్ల నుండి అర్హులను ఎంపీపీ గా, వైస్ ఎంపీపీ గా ఎంపిక చేస్తారు. ఏదైనా కారణాలతో ఆరోజు ఎంపిక జరగకుంటే మరుసటి రోజు 27న ఎన్నికలు నిర్వహిస్తారు.


Next Story