- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భర్తను చంపించిన కిరాతక భార్య.. దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం
మధ్యప్రదేశ్ ధార్లో దారుణం! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య. దోపిడీగా నమ్మించేందుకు డ్రామా ఆడి దొరికిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రియుడితో భర్తను చంపించిన భార్య దోపిడీ దొంగలు చంపారని నమ్మించాలని చేసి విఫలం అయింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా గొండిఖేడ చరణ్ గ్రామంలో జరిగింది. ఈ కేసును పోలీసులు ఛేదించిన తర్వాత మీడియాకు వివరాలతను వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారం భర్తను దోపిడీ దొంగలే చంపారని నమ్మించాలని చూసిన భార్య అసలు గుట్టును పోలీసులు బయటపెట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త దేవకృష్ణ పురోహిత్ను హత్య చేయించిన నిందితురాలు ప్రియాంక పురోహిత్ను, ఆమె ప్రియుడు కమలేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే?
ఏప్రిల్ 7, 2026 రాత్రి దేవ కృష్ణ, అతని భార్య ప్రియాంక తమ గదిలో నిద్రపోతుండగా, పక్క గదిలో దేవ కృష్ణ తల్లి, సోదరి ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, దేవ కృష్ణ తలపై పదునైన ఆయుధం తో కొట్టి, ఇంట్లోని విలువైన వస్తువులను దోచుకెళ్లారని సమాచారం అందింది. తీవ్ర గాయాలపాలైన దేవకృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. ఎస్పీ మయాంక్ అవస్థి నేతృత్వంలోని డాగ్ స్క్వాడ్, సైబర్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి.
బయటపడ్డ భార్య కుట్ర..
పోలీసుల లోతైన విచారణలో అసలు నిజం బయటపడింది. భార్య ప్రియాంక తన ప్రియుడు కమలేష్ పురోహిత్తో కలిసి ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసినట్లు తేలింది. భర్తను చంపేందుకు లక్ష రూపాయలకు ఒక కిల్లర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. హత్యను దోపిడీగా చిత్రీకరించేందుకు, కిల్లర్ ప్రియాంకను కట్టివేసి పక్క గదిలో ఉంచాడు. ప్లాన్ ప్రకారం కొంత సమయం తర్వాత ఆమె గట్టిగా కేకలు వేసి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది. నిందితుడు కమలేష్ను పోలీసులు అరెస్ట్ చేయగా, దొంగిలించినట్లుగా భావిస్తున్న ఆస్తిని ప్రియాంక నివాసం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులపై హత్య, కుట్ర కేసులను నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.






