కష్టాల్లో కాంగ్రెస్.. 400 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్క చోట లీడ్

by Disha Web Desk 2 |
కష్టాల్లో కాంగ్రెస్.. 400 స్థానాల్లో పోటీ చేస్తే.. ఒక్క చోట లీడ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా 400 చోట్ల బరిలో దిగి.. భారీగా ప్రచారం చేసింది. ఏకంగా ప్రియాంక గాంధీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ప్రచారం జోరుగా చేసినప్పటికీ యూపీ ఓటర్లలో నమ్మకం దక్కించుకోలేకపోయారు. మొత్తం 400 చోట్ల పోటీ చేసినప్పటికీ ఒక్క చోట మాత్రమే లీడ్‌లో ఉంది. దీంతో దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. దేశంలో ఎక్కువ సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఘోరంగా ఓడిపోవటం చూస్తామనుకోలేదన్నారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఓటరుని వశం చేసుకోలేకపోయారంటూ అభిప్రాయపడుతున్నారు.


Next Story

Most Viewed