సైలెంట్ టార్గెట్.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బీజేపీ ఉచ్చు

by Disha Web Desk |
సైలెంట్ టార్గెట్.. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు బీజేపీ ఉచ్చు
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. గులాబీ పార్టీని ఇరుకునపెట్టేందుకు వ్యూహ రచన చేస్తోంది. టీఆర్ఎస్​ట్రాప్‌లో బీజేపీ నేతలు పడకుండా ఉండేలా ఎప్పటికప్పుడు నాయకులకు రాష్ట్ర నాయకత్వం దిశా నిర్దేశం చేస్తోంది. టీఆర్ఎస్​నేతలనే తమ లైన్​లోకి వచ్చేలా చేయాలని సూచనలు చేస్తోంది. కేంద్రంపై, స్థానిక బీజేపీ నేతలపై టీఆర్ఎస్​మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శలు చేసినా వాటిని అడ్డగోలు వాదనలకు దిగకుండా నిర్దిష్టమైన కౌంటర్​అటాక్స్​చేయాలని నిర్ణయించింది. అలా అయితే ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశాలుంటాయని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్​మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతితో పాటు ప్రజా సమస్యలు, ఉద్యోగాల భర్తీ, వరిధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్​నేతలు చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు స్ట్రాంగ్‌గా తిప్పికొట్టాలని నిర్ణయించింది. ఈ అంశాలనే ప్రధాన ఎజెండాగా పెట్టుకోనుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పలువురిపై రెయిడ్స్​జరుగుతున్నా బీజేపీ నేతలు సైలెంట్​గా తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి అవినీతి, అక్రమాలను వెలికితీసి ప్రజలకు దగ్గరయ్యే పనిలో బీజేపీ శ్రేణులు ఉన్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్​నేతల అవినీతిపై కూడా స్థానిక నేతలు ఫోకస్​చేయాలని నాయకులు, కార్యకర్తలకు రాష్ట్ర నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. గులాబీ శ్రేణుల మైనస్‌లపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టి ఇరుకున పెట్టాలని ప్లాన్​చేస్తోంది.

ఇప్పటికే కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. హుజురాబాద్​ఎన్నికల అనంతంరం సీఎం కేంద్రాన్ని టార్గెట్​గా చేసుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు తిరిగి అదే అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు. ఉద్యమం చేపట్టాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు అలాంటి వాదనలకు దిగకుండా ప్రజలకు నిజానిజాలు చెప్పి వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేపట్టాలని రాష్ట్ర బీజేపీ సూచనలు చేస్తోంది. అందుకే ఎమ్మెల్యేల సస్పెన్షన్​విషయంలో తీవ్రస్థాయిలో ఆందోళనలకు దిగకుండా సమస్యను ప్రజలకు తెలపాలని మాత్రమే బీజేపీ ప్రయత్నించింది. అంతేకాకుండా అసెంబ్లీ వేదికగా కంటోన్మెంట్ కు కరెంట్​కట్​చేస్తామని మంత్రి కేటీఆర్​వ్యాఖ్యలు చేసినా కౌంటర్​అటాక్​ఇచ్చి సైలెంట్​అయిపోయారు. ఇప్పుడు వరిధాన్యం విషయంలో కూడా కేంద్రం గతంలో చెప్పిన విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించే పనిలో పడ్డారు.


Next Story

Most Viewed