- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
శ్రీనగర్ ఎన్కౌంటర్లో ఉగ్రవాది మృతి
శ్రీనగర్: కశ్మీర్ భద్రతా దళాలు ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. తాజాగా సీఆర్పీఎఫ్ను కాల్చిచంపిన ఘటనలో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా అదే సమయంలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డట్లు చెప్పారు. అంతకుముందు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై జరిపిన దాడిలో వీరికి ప్రమేయమున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆదివారం కశ్మీర్ జోన్ పోలీసులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'శ్రీనగర్లో తాజాగా సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ప్రమేయం ఉన్న ఉగ్రవాది ఎన్కౌంటర్లో మరణించారు. మరొకరిని అదుపులోకి తీసుకున్నాం' అని ట్వీట్ చేశారు. కాగా, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ స్థలంపై ఉగ్రవాదులు గ్రెనేడ్ విసిరారు. ఈ ఘటనలో ఒక సీఆర్పీఎఫ్ సిబ్బంది, ఇద్దరు పోలీసులకు గాయాలు అయ్యాయని అధికారి తెలిపారు. గాయపడిన వారిని శ్రీనగర్లోని ఆర్మీ 92 బేస్ ఆసుపత్రికి తరలించారు.