- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ.. పది మందిపై కేసు
దిశ, పరిగి: మద్యం మత్తులో కుర్చీ కోసం గొడవ జరిగి పది మంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరిగి ఎస్ఐ పి. విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి మున్సిపల్ పరిధిలోని వీరభ్రద వైన్స్ పక్కనే గల పర్మిట్ రూంలో శుక్రవారం కుర్చీ కోసం గొడవపడ్డారు. పరిగి బాలాజీ నగర్ కు చెందిన బొబ్బిలి భాస్కర్, రఘు బాబు, బాబు, ముష్టిపల్లి సంగమేశ్వర్లు, గుడిసె నవీన్, కొత్త బాలరాజు, బాలానగర్ రాజు, రాజు, తప్ప నారాయణ తాగిన మైకంలో మేం కూర్చున్న కుర్చీని ఎందుకు లాక్కున్నారంటూ ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుంటూ కొట్టుకున్నారు. పర్మిట్రూం నుంచి ఈ గొడవ కాస్త హైవే 163పైకి వచ్చింది. రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ విషయమై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదులపై 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు. నిందితులను పరిగి తహశీల్దార్విద్యాసాగర్రెడ్డి ముందు హాజరు పరిచి బైండోవర్చేసినట్లు ఎస్ఐ తెలిపారు.