- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదే పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారు?: TG హైకోర్టు
సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్డెస్క్: సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే టికెట్ల రేట్లు(Movie Ticket Rates) ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడింది. ఎన్నిసార్లు చెప్పినా మీ ఆలోచన మారడం లేదు ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియదా? అని సీరియస్ అయింది. కాగా, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది రాజాసాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చింది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ల్లో రూ.89 పెంపునకు అనుమతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే ఓజీ, అఖండ2, పుష్ప2 వంటి సినిమాల విషయంలో మొట్టికాయలు వేశామని.. అయినా మారడం లేదని ప్రభుత్వంపై సీరియస్ అయింది.






