'కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు బిర్యానీ రుచి చూస్తున్నారు'

by Disha Web Desk 2 |
కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు బిర్యానీ రుచి చూస్తున్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ‌లో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన‌ ట్వీట్‌కు ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత కౌంట‌ర్ ఇచ్చారు. రాజ‌కీయ ల‌బ్ధి కోసం ట్విట్టర్‌లో సంఘీభావం చెప్పడం స‌రికాద‌న్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండ‌కూడ‌దన్నారు. పంజాబ్, హ‌ర్యానాలో ధాన్యం సేక‌రించిన మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేక‌రించాల‌ని కోరుతున్నామ‌ని క‌విత తెలిపారు. అయితే, కవిత ట్వీట్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ స్పందించారు. ''కవిత గారూ.. మాజీ ఎంపీలను పార్లమెంట్‌ లోపలికి అనుమతించరు. కాబట్టి మీరు పార్లమెంట్‌కు రాలేరు. ఈ క్రమంలో దానిని ఉపయోగించుకొని టీఆర్‌ఎస్ ఎంపీలు సెంట్రల్ హాల్‌లో ఢోక్లా, బిరియానీ రుచి చూస్తున్నారు. ఆగస్ట్ 2021లో ఒప్పందంపై ఎవరు సంతకం చేశారో మర్చిపోవద్దు.'' అని ట్విట్టర్ వేదికగా కవితకు కౌంటర్ ఇచ్చారు.

Next Story

Most Viewed