ఐర్లాండ్‌లో టీమిండియా టూర్.. జూన్ 26 నుంచి 28 వరకు రెండు టీ20లు

by Web Desk |
ఐర్లాండ్‌లో టీమిండియా టూర్.. జూన్ 26 నుంచి 28 వరకు రెండు టీ20లు
X

న్యూఢిల్లీ : భారత జట్టు ఐర్లాండ్‌ పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం వచ్చేసింది. జూన్ నెలలో ఐర్లాండ్‌లో 'సీజన్ ఆఫ్ స్టార్' పేరిట మెగా టోర్నీ నిర్వహించేందుకు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని బుధవారం ట్విట్టర్ వేదికగా ఐరిష్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. హోమ్ గ్రౌండ్‌లో ఏకంగా నాలుగు జట్లతో కలిపి ఈ టోర్నీ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఐసీసీ ప్రపంచ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, అఫ్ఘనిస్తాన్‌లతో ఐర్లాండ్ జట్టు వైట్‌బాల్ మ్యాచులు ఆడనుంది. ఇవి ఐర్లాండ్‌ జట్టు 2023లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ క్వాలిఫైయర్ కోసం ఉపయోగపడనున్నాయి. అయితే, జూన్ 26, 28వ తేదిల్లో ఐర్లాండ్‌తో భారత జట్టు రెండు టీ20 మ్యాచులను ఆడనుంది. 2 నెలల పాటు జరగనున్న ఈ మ్యాచులకు మలాహిడే, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్‌లు వేదికలు కానున్నాయి.





Next Story

Most Viewed