ఒడిశాలోని బాలాసోర్‌లో క్షిపణి పరీక్ష విజయవంతం.. డీఆర్డీవో ప్రకటన

by Disha Web |
ఒడిశాలోని బాలాసోర్‌లో క్షిపణి పరీక్ష విజయవంతం.. డీఆర్డీవో ప్రకటన
X

డిస్పూర్: భారత ఆర్మీ ప్రయోగించిన క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఆదివారం ఒడిశాలోని బాలాసోర్‌లో మీడియం రేంజ్ భూగగన తల మిసైల్ పరీక్షను చేసినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) తెలిపింది. నేరుగా లక్ష్యాన్ని క్షిపణి తాకినట్లు పేర్కొంది. 'ఎంఆర్ఎస్ఏఎం-ఆర్మీ మిసైల్ వ్యవస్థను ఐటీఆర్ బాలాసోర్ నుంచి ప్రయోగించింది. ఈ వ్యవస్థ భారత ఆర్మీలో భాగం. ఈ పరీక్షలో మిసైల్ సుదూరంలో ఉన్న లక్ష్యాన్ని నేరుగా చేరింది' అని అధికారులు తెలిపారు. కాగా బుధవారమే బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే.

Next Story