- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళలపై చేసిన దాడికి స్వామీ దాస్ బదిలీ..
దిశ, గోదావరిఖని: అర్జీ-1 పరిధిలోని వర్క్ షాప్ లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేస్తు బెదిరింపులకు పాల్పడిన స్వామీ దాస్ పై వేటు పడినట్లు సమాచారం. సింగరేణి యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎట్టకేలకు స్పందించిన అధికారులు సదరు నాయకుడిని మణుగూరులోని సత్తుపల్లికి బదిలీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే సదరు నాయకుడు వర్క్ షాప్ లో ఓ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా.. తోటి కార్మికులను ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం స్వామీ దాస్ తనపై దాడి చేయించాడని సదరు మహిళ వర్క్ షాప్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. అది సింగరేణి వ్యాప్తంగా కలకలం సృష్టించింది. సదరు మహిళకు కార్మిక సంఘాల నేతలతో పాటు కార్మికులు కూడా మద్దతు ప్రకటించడం తో ఎట్టకేలకు సదరు నాయకుడిని అధికారులు బదిలీ చేశారు.