ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలతో నిఘా

by Disha Web Desk |
ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీసీ కెమెరాలతో నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానల్లో సర్కార్ నిఘా పెట్టింది. బస్తీ, ప్రైమరీ, అర్బన్ హెల్త్ సెంటర్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ స్టలేషన్ కొరకు ఈసీఐఎల్ సంస్థతో ఆరోగ్య శాఖ ఒప్పందo కుదుర్చుకున్నది. ఈ నెల చివరి నాటికి అన్ని దవాఖాన్లలో కెమెరాల ఇన్‌స్టాలేషన్ పూర్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దవాఖాన్లలోని పేషెంట్ వెయిటింగ్ హాల్, ఫార్మసీ, ఓపీ రూమ్‌ల్లో కెమెరాలను బిగించబోతున్నారు.

హైదరాబాద్‌లోని హెల్త్ డైరెక్టరేట్‌లో ఉండే కంట్రోల్ సెంటర్‌‌కు, సెక్రటేరియట్‌లో హెల్త్ సెక్రటరీ ఆఫీసుకు, మంత్రి పేషీకి ఈ కెమెరాలను అనుసంధానించనున్నారు. దీంతో ఏయే దవాఖానలో ఏంజరుగుతుందో ఇక్కడి నుంచే మానిటర్ చేయనున్నారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో కెమెరాలు ఇన్‌స్టాల్ చేసి, వాటి పనితీరును పరిశీలిస్తున్నారు.


Next Story