- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: నిర్మాత డి. సురేష్ బాబు
దగ్గుబాటి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను డి. సురేష్ బాబు (D. Suresh Babu) ఖండించారు.

దిశ, వెబ్ డెస్క్: దగ్గుబాటి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను డి. సురేష్ బాబు (D. Suresh Babu) ఖండించారు. డెక్కన్ కిచెన్ కేసులో వారి కుటుంబం పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) ఆదేశాలు ఇచ్చారని, ఈ నెల 23న తమ కుటుంబం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తప్పుడు వార్తలపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో దగ్గుబాటి కుటుంబం జనవరి 23, 2026న కోర్టుకు హాజరు కావాలని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలను ప్రముఖ డి. సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు.
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే న్యాయస్థానం (XVII అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్) 14-11-2025 నాటి ఉత్తర్వుల్లోనే వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టంగా తెలిపిందని, తమపై ఎలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని సురేష్ బాబు వివరించారు. కేసు కేవలం పిటిషన్ల పరిష్కారం కోసమే వాయిదా పడిందని, వ్యక్తిగత హాజరు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






