ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: నిర్మాత డి. సురేష్ బాబు

by Malleboina Mahesh |

దగ్గుబాటి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను డి. సురేష్ బాబు (D. Suresh Babu) ఖండించారు.

ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: నిర్మాత డి. సురేష్ బాబు
X

దిశ, వెబ్ డెస్క్: దగ్గుబాటి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను డి. సురేష్ బాబు (D. Suresh Babu) ఖండించారు. డెక్కన్ కిచెన్ కేసులో వారి కుటుంబం పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) ఆదేశాలు ఇచ్చారని, ఈ నెల 23న తమ కుటుంబం హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా తప్పుడు వార్తలపై పత్రిక ప్రకటన విడుదల చేశారు. అందులో దగ్గుబాటి కుటుంబం జనవరి 23, 2026న కోర్టుకు హాజరు కావాలని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తలను ప్రముఖ డి. సురేష్ బాబు తీవ్రంగా ఖండించారు.

ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే న్యాయస్థానం (XVII అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్) 14-11-2025 నాటి ఉత్తర్వుల్లోనే వ్యక్తిగత హాజరు అవసరం లేదని స్పష్టంగా తెలిపిందని, తమపై ఎలాంటి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేయలేదని సురేష్ బాబు వివరించారు. కేసు కేవలం పిటిషన్ల పరిష్కారం కోసమే వాయిదా పడిందని, వ్యక్తిగత హాజరు కోసం కాదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యతారాహిత్యంగా వార్తలు రాసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story