నర్వ రైతు వేదికలో సబ్సిడీపై కంది, పెసర విత్తనాలు సరఫరా:ఏఈవో

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలు, పెసర్లు సబ్సిడీపై రైతులకు అందించడం జరుగుతుందని నర్వ ఏఈఓ అఖిలా రెడ్డి తెలియజేశారు.

నర్వ రైతు వేదికలో సబ్సిడీపై  కంది, పెసర విత్తనాలు సరఫరా:ఏఈవో
X

దిశ,నర్వ: మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలు, పెసర్లు సబ్సిడీపై రైతులకు అందించడం జరుగుతుందని నర్వ ఏఈవో అఖిలా రెడ్డి తెలియజేశారు. నర్వ రైతు వేదికలో నిలువ ఉన్నటువంటి రకాలు.. కంది PRG-176 , LRG 133, WRG-255 పెసర సంబంధించిన రకం MGG-385 రైతులకు అందుబాటులో ఉన్నాయని రైతు వేదికకు వచ్చి సబ్సిడీ పై తీసుకోవాలని తెలియజేశారు. కంది, పెసర అవసరం ఉన్న రైతులు తమ పట్టా పాస్ బుక్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్లి సబ్సిడీ పై పొందాలని నర్వ అగ్రికల్చర్ ఆఫీసర్ అఖిలా రెడ్డి రైతులకు తెలియజేశారు.

Next Story