రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన విద్యార్థి హఠాన్మరణం..

by Disha Web Desk 19 |
రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన విద్యార్థి హఠాన్మరణం..
X

దిశ, బషీరాబాద్: ఓ రోడ్డు ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసి గుండె ఆగి విద్యార్థి మరణించిన సంఘటన బషీరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన యశ్వంత్ గౌడ్ బషీరాబాద్‌లోని అశ్విని జూనియర్ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే, ఆదివారం రోజు రాత్రి 9 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీ కొనడాన్ని ప్రత్యక్ష్యంగా చూసిన యశ్వంత్ గౌడ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా, ప్రమాదానికి గురైనవారు స్వల్పగాయలతో సురక్షితంగా ఉన్నారు. కానీ తన కళ్ళముందే ప్రమాదాన్ని చూసిన యశ్వంత్ గౌడ్ హఠాన్మరణం చెందడంతో జీవన్గి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



Next Story