- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులు బలోపేతమైతేనే నవ భారతం సుసంపన్నం : పీఎం మోడీ
by samatah |
న్యూఢిల్లీ: రైతులు ఎంత బలవంతులైతే నవ భారతదేశం అంత సుసంపన్నం అవుతుందని ప్రధాని మోడీ అన్నారు.

X
న్యూఢిల్లీ: రైతులు ఎంత బలవంతులైతే నవ భారతదేశం అంత సుసంపన్నం అవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇతర వ్యవసాయ పథకాలు కోట్లాది రైతులకు కొత్త బలమని ఉద్ఘాటించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.1.82 లక్షల కోట్లు బదిలీ అయ్యాయని తెలిపే గ్రాఫిక్ను షేర్ చేశారు. దేశం రైతుల సోదర సోదరిమణుల పట్ల గర్వంతో ఉంది. వారు ఎంత బలవంతులైతే, దేశం మరింత సుసంపన్నం అవుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, ఇతర వ్యవసాయ పథకాలు దేశంలోని కోట్ల మంది రైతులకు నూతన బలాన్ని ఇస్తున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
Next Story






