ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

by Muthe.Rajitha |

పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.

ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను గురయ్యి, చివరికి దాదాపు ఎలాంటి మార్పు లేకుండా ఫ్లాట్‌గా ముగిశాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ కేవలం 1.44 పాయింట్ల స్వల్ప లాభంతో 77,186.87 వద్ద ముగియగా, నిఫ్టీ 5.75 పాయింట్ల స్వల్ప నష్టంతో 24,072.75 వద్ద స్థిరపడింది. ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 30 సూచీలో ఐటీ మరియు ఆటోమొబైల్ రంగాలు మార్కెట్‌ను కొంతవరకు ఆదుకున్నాయి. ప్రధానంగా హెచ్‌సీఎల్‌టెక్, ఇండిగో, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐటీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు కొనుగోళ్ల మద్దతుతో లాభాల బాట పట్టాయి.

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ట్రెంట్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్ వంటి ప్రముఖ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలను చవిచూశాయి. దేశీయ మార్కెట్లలోనే కాకుండా ఆసియా అంతటా కూడా ప్రతికూల పవనాలు వీచాయి. చమురు ధరల సెగతో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి సూచీ మరియు జపాన్ నిక్కీ మార్కెట్లు కూడా నష్టాల పతనాన్ని చవిచూశాయి. ఇక డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 96.34 వద్ద స్థిరపడింది.

Next Story