- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటులో స్టాలిన్ వ్యూహం
"తమిళనాడు ఎన్నికల యుద్ధం: డీఎంకే కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి. 164 సీట్లలో డీఎంకే, కాంగ్రెస్కు 28. డీఎంకే అభ్యర్థిగా మాజీ సీఎం పన్నీరు సెల్వం!"

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చింది మొదలు రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల పర్వం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అధికార డీఎంకే కూటమితో కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే , సీపీఐ , సీపీఎం వంటి పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. అయితే కూటమిలో భాగంగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొనగా.. సీట్ల సర్దుబాటులో సీఎం స్టాలిన్ వ్యూహం అందరిని ఆశ్చర్య పరిచింది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటును పూర్తి చేసి, అభ్యర్థుల ప్రకటనతో డీఎంకే కూటమి ఎన్నికల శంఖారావం పూరించింది.
ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA)లో భాగంగా మొత్తం 234 స్థానాలకు గాను మిత్రపక్షాలకు 70 సీట్లు కేటాయించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా 28 స్థానాలు లభించగా, కొత్తగా కూటమిలో చేరిన డీఎండీకే (DMDK)కు 10 సీట్లు కేటాయించడం విశేషం. మిగిలిన స్థానాల్లో వీసీకే 8, సీపీఐ 5, సీపీఎం 5 చొప్పున పోటీ చేయనున్నాయి. ఈ సర్దుబాటు ద్వారా డీఎంకే తన పట్టును నిలుపుకుంటూనే, మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లే వ్యూహాన్ని అమలు చేస్తోంది.
మరోవైపు, డీఎంకే పార్టీ స్వయంగా 164 స్థానాల్లో పోటీకి దిగుతుండగా, అభ్యర్థుల ఎంపికలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఏఐఏడీఎంకే నేత ఓ. పన్నీరు సెల్వం (OPS) ఇటీవల డీఎంకేలో చేరి, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలోకి దిగుతుండటం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి, అభివృద్ధి, ద్రవిడ నమూనా పాలనే లక్ష్యంగా ప్రచారంలోకి దూసుకెళ్తున్నారు. ఏప్రిల్ 23న జరగనున్న ఈ పోలింగ్లో డీఎంకే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటుందనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.






