అలా చేస్తే రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పింది.. ప్రముఖ యాంకర్

by Disha Web Desk 17 |
అలా చేస్తే రూ. 5 లక్షలు ఇస్తానని చెప్పింది.. ప్రముఖ యాంకర్
X

దిశ, సినిమా: ఓటీటీలో నాన్ స్టాప్‌గా ప్రసారమవుతున్న తెలుగు 'బిగ్‌బాస్‌' నెల రోజులు పూర్తిచేసుకోగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్‌ అయ్యారు. అందులో ముమైత్‌ తొలివారమే ఎలిమినేట్‌ కాగా ఆమెను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో హౌస్‌లోకి పంపించారు. కానీ ప్రేక్షకులు ఆమెను మరోసారి ఎలిమినేట్‌ చేయడం గమనార్హం. కాగా నిన్నటి ఎపిసోడ్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ద్వారా ముమైత్‌తో పాటు స్రవంతి కూడా హౌస్‌ నుంచి బయటకు వచ్చింది. ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్రవంతి మరో కంటెస్టెంట్ మిత్ర శర్మ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'హౌస్‌లో నా కష్టాల గురించి చెబితే మిత్ర రూ.5 లక్షలు ఇస్తానంది. మీరు బాధపడకండి, నా ఇంట్లో పనిచేసే అమ్మాయికి రూ.10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. అలాంటిది మీరు నన్ను దగ్గరుండి చూసుకున్నారు. తినిపించారు. నా ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మ లా, అక్కలా ఆదరించారు. మీకు రూ.5 లక్షలిస్తాను' అని హామీ ఇచ్చినట్లు తెలిపింది. తానెవరో తెలియకపోయినా మిత్ర శర్మ అలా మాట్లాడటం తనను భావోద్వేగానికి గురిచేసిందన్న స్రవంతి.. అందుకే ఆమెను మనస్ఫూర్తిగా హత్తుకున్నట్లు తెలిపింది.

Next Story

Most Viewed