అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్..

by Disha Web Desk |
అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : "ఉపోద్ఘాతం, ఉపన్యాసాలు వద్దు. ఇది అసెంబ్లీ మాత్రమే. అడగాలనుకున్నది సూటిగా ప్రశ్నించండి. సమయాన్నిదయచేసి వేస్ట్ చేయొద్దు" అంటూ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి​తొలిసారి డిఫరెంట్​ స్టైల్ లో సంధించారు. అదీ అధికార పక్ష ఎమ్మెల్యేలపై విరుచుకుపడటం తో అందరూ షాక్​ కు గురయ్యారు. సోమవారం క్వశ్చన్​అవర్​షురూ కాగానే టీఆర్ఎస్​ఎమ్మెల్యేలు గత ప్రభుత్వం, సీఎం కేసీఆర్​నాయకత్వం అంటూ పదే పదే పోల్చుతూ ప్రశ్నలు అడగకుండా సర్కార్ ను పొగిడే కార్యక్రమాన్ని ఎత్తుకున్నారు. గతంలో చేయని పనులను టీఆర్ఎస్​చేసిందని చెప్పుకుంటూ అధిక సమయాన్ని తీసుకున్నారు. స్పీకర్​ మైక్​ ఇవ్వగానే కేసీఆర్​ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ లేని స్కీంలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రాజెక్టులు పూర్తి చేశామని పాత ముచట్లనే రిపీట్​ చేశారు. పదే పదే సభ ఇదే విధానంలో వెళ్తుండటంతో స్పీకర్​ విసిగిపోయారు. అవకాశం వచ్చిన ప్రతీ ఎమ్మెల్యే ఇదే దిశగా వ్యవహరిస్తుండగా, స్పీకర్​ టీఆర్ఎస్​ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయాన్ని వృథా చేయడం సరైన విధానం కాదంటూ హితవు పలికారు. మరోవైపు ప్రశ్నలు అడిగిన వారిని స్పీకర్​ ప్రత్యేకంగా అభినందించడం గమనార్హం.

Next Story

Most Viewed