Somu Veerraju: ఏపీ క్యాబినెట్‌పై బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు..

by Satheesh |   (  Updated:2022-04-11 12:40:53  IST  )

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 25మంది కొత్త మంత్రులతో ఏర్పాటయ్యింది.- Latest Telugu News

Somu Veerraju: ఏపీ క్యాబినెట్‌పై బీజేపీ చీఫ్ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ 25మంది కొత్త మంత్రులతో ఏర్పాటయ్యింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న క్యాబినెట్ విస్తరణపై తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిలో కూరుకున్న వారినే క్యాబినెట్‌లోకి తీసుకున్నారని విమర్శించారు. అసలు జగన్ క్యాబినెట్‌లో మంత్రి పదవులకు పవర్ ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం వల్లనే ఏపీలో విద్యుత్ కొరత ఏర్పడిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు, ప్రకటనలకు ముందుగానే చెల్లింపులు చేసి.. విద్యుత్‌కు ఎందుకు ముందుగా చెల్లింపులు చేయారని ప్రశ్నించారు. అసలు మాజీ హోంమంత్రి సుచరిత ఒక్క డీఎస్పీనైనా ట్రాన్స్ ఫర్ చేయగలిగారా అని అన్నారు. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత కానిస్టేబుల్‌నైనా ట్రాన్స్ ఫర్ చేయగలరా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Next Story