- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోమిరెడ్డి నేత్ర దానంతో ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగు.
by Batti.Sumithra |
మండలంలోని ఇర్సులాపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సోమిరెడ్డి (60) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు.

X
దిశ, బయ్యారం : మండలంలోని ఇర్సులాపురం గ్రామానికి చెందిన వాసిరెడ్డి సోమిరెడ్డి (60) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. సోమిరెడ్డి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఖమ్మం పట్టణానికి చెందిన నేత్రనిధి ఆర్గనైజషన్ కి నేత్రాలను దానం చేశారు. ఈ దానం ద్వారా మరొ ఇద్దరికి చూపు కలిగే అవకాశం ఉండటం గొప్ప విషయమని నేత్రనిధి సభ్యులు పేర్కొన్నారు. సోమిరెడ్డి నేత్రదానం చేసి తన మరణానంతరం మరో వ్యక్తికి ఈ లోకాన్ని చూసే మహత్తర అవకాశాన్ని కల్పించారని ఆ కుటుంబానికి స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి భార్య జ్యోతి, కుమారులు యశ్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నేత్రనిధి బాద్యులు అనంత పద్మనాభం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






