- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దర్శకుడిపై గాజు బాటిల్తో దాడిచేసిన నటి.. వీడియో వైరల్
దిశ, సినిమా: 'ఇండియాస్ గాట్ ట్యాలెంట్' రియాల్టీ షో తొమ్మిదో సీజన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటి శిల్పాశెట్టి, ర్యాపర్ బాద్షా, నటుడు కిరన్ ఖేర్, రచయిత మనోజ్ ముంతషిర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ షోకు తాజాగా స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గెస్ట్గా హాజరయ్యారు. అయితే రోహిత్ శెట్టితో మాట్లాడేందుకు శిల్పా ఆసక్తి చూపిస్తుండగా.. బాద్షా ఆ అవకాశం ఇవ్వకుండా తనే మాట్లాడుతుంటాడు. దీంతో ఒక్కసారిగా కోపం పెంచుకున్న నటి.. ఓ గ్లాస్ బాటిల్తో రోహిత్పై దాడిచేసింది. దీంతో షోలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అవగా.. 'నీకేమైనా పిచ్చి పట్టిందా? నా సూట్ పాడైపోయింది' అని రోహిత్ గట్టిగా అరిచాడు. అయినా ఆవేశంతో ఊగిపోతున్న శిల్పా అక్కడితో ఆగకుండా.. పగలగొట్టగా మిగిలిన అదే బాటిల్తో బాద్షాపై కూడా దాడిచేయడం విశేషం. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.