- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాటలు చెప్పేవాళ్లతో విసిగిపోయా.. సరైన వ్యక్తులే కావాలి : నటి
దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఇబ్బందులు, అనుభవాల గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలతో పాటు ఇండస్ట్రీ కల్చర్ గురించి చెప్పుకొచ్చింది. 'నేను 27 ఏళ్లుగా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను. యాక్టింగ్ టాలెంట్ చూసి చాలామంది పొగిడేవారు. అయితే అవన్నీ పొగడ్తలుగానే మిగిపోయాయి తప్ప కెరీర్కు ఏ మాత్రం ఉపయోగపడలేదు. మీ కోసం మంచి కథ రాశామని ఇంతవరకు ఎవరూ నా దగ్గరకు రాలేదు. కొంతమంది ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేక పోయారు. కానీ మీతో వర్క్ చేయాలనుందంటూ మళ్లీ ఏవేవో కబుర్లు చెబుతారు. ఇలాంటి మాటలు విని విని బోర్ కొడుతుంది' అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా మాట మీద నిలబడే వ్యక్తుల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపిన నటి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్రీలకు స్వేచ్ఛ దొరుకుతోందని, ఫిల్మ్ మేకర్స్లోనూ చాలా మార్పులు వచ్చాయని చెబుతోంది.