ట్రైన్‌లో షాహిద్, పట్టాలపై భార్య.. ఉత్కంఠ రేపిన 'డీడీఎల్‌జే' సీన్

by Disha Web Desk 19 |
ట్రైన్‌లో షాహిద్, పట్టాలపై భార్య.. ఉత్కంఠ రేపిన డీడీఎల్‌జే సీన్
X

దిశ, సినిమా : బాలీవుడ్ క్యూట్ కపుల్ షాహిద్ కపూర్‌-మీరా రాజ్‌పుత్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక రైల్వే స్టేషన్‌లో 'దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే' సినిమాలోని షారూఖ్ ఖాన్, కాజోల్‌ల ట్రైన్ సీన్‌పై స్కూప్ చేశారు. ఈ మేరకు షాహిద్ ట్రైన్ ఫుట్ పాత్ దగ్గర నిలబడి చిరునవ్వుతో భార్యకు చేయి అందించగా ఆమె సంతోషంగా ఆ చేయి పట్టుకున్నట్లు కెమెరాకు ఫోజులిచ్చింది. ఇక ఈ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన రాజ్‌పుత్ 'యాక్టింగ్ చిల్ ఆల్‌సో చీజీ' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న లుక్స్‌పై స్పందించిన ఫ్యాన్స్

'మీరు చాలా అందంగా ఉన్నారు. అలాగే 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే' సెకండ్ పార్ట్ తీయండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Next Story

Most Viewed