ఆ విషయాన్ని తల్లికి చెప్పితే వినలేదు.. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో..!

by Web Desk |
ఆ విషయాన్ని తల్లికి చెప్పితే వినలేదు.. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో..!
X

దిశ, ఏపీ బ్యూరో, రాయలసీమ: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో కూతురి(13) పై ఓ తండ్రి, చిన్నాన్న కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ ఘోరాన్ని తల్లికి తెలిపింది. ఆమె కూతురి మాటలు చెవికెక్కించుకోలేదు. బాలిక ఆక్రందనను అర్థం చేసుకునే వారు లేకపోయారు. ఆ మేరకు బాలికే ధైర్యం చేసి మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఉదంతం వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను రిమాండ్‌‌కు తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా.. పట్టణంలోని రోసీ నగర్ లో బాలిక(8)పై నాగరాజు అనే వ్యక్తి అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బాలికకు వైద్యం అందిస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Next Story